రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళుతున్న పాదచారులను వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి... కారు డ్రైవర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా ... అతడు కారు వదిలి డ్రైవర్ పరారైయ్యాడు.
దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన షిప్ట్ కారు నంబర్ ఏపీ 28 టీవీ 2632 ను పోలీసులు స్వాధీనం చేసుకుని... స్టేషన్ కు తరలించారు. మృతులు నాగారానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.