యాదగిరిగుట్ట : జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ముగ్గురు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. యాదగిరి గుట్ట మండలం మహబూబ్పేట లో గురువారం సంతోష (36 ) అనే మహిళ ఆర్థిక ఇబ్బం దులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొంత కాలంగా సంతోష కుటుంబం ఆర్థిక ఇబ్బం దులతో కొట్టుమిట్టాడుతోంది. భర్త మల్లేశ్ అనారోగ్యం పాలవగా, కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. వారి కున్న రెండెకరాల్లో వేసిన పత్తి వర్షాలు లేక ఎదగడంలేదు. దీంతో ఆమె కొంత కాలంగా మనోవేదనకు గురవుతుం డేది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగింది. ఆమె పరిస్థితిని గమనించిన చుట్టుపక్క రైతులు ద్విచక్రవాహనంపై భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు.
పిట్టంపల్లిలో వ్యక్తి..
చిట్యాల : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి గురువారం వైద్యం పొందుతూ మృతి చెందినట్లు చిట్యాల ఏఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. మండలంలోని పిట్టంపల్లికి చెందిన బిల్లపాటి కృష్ణారెడ్డి(52) కొన్నిరోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఈనెల 2వ తేదిన గ్రామ శివారులోని పొలంలో పురుగులమందు తాగాడు. చాలాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు అదేరోజు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాల్గురోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణారెడ్డి గురువారం ఉదయం చనిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.
తమ్ముడు మందలించాడని..
భువనగిరి అర్బన్ : కల్లు తాగొద్దని తమ్ముడు మందలించడంతో భువనగిరి పట్టణానికి చెందిన బుక్కా విజయేందర్(25)ను అనే యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడాడు. తండ్రి బుక్కా నర్సింహ్మ ఇటీవలే చనిపోయాడు. అప్పటినుంచి కల్లుకు బానిసైన విజయేందర్ పనులు మానేసి తాగుతుండేవాడు. అన్న పరిస్థితి చూడలేక అతని తమ్ముడు గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురై పగిడిపల్లి-భువనగిరి రైల్వేష్టేషన్ల మధ్య ఉన్న పట్టాలపై రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై రైల్వే ఎస్ఐ దయాకర్ కేసు నమోదుచేసుకొని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
Published Fri, Aug 7 2015 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పెరుగుతున్న క్యాష్ విత్డ్రాలు!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
Advertisement