ఆ భూములపై సర్కారు ఎలాంటి హక్కూ కోరజాలదు
రిజిస్ట్రేషన్ నిరాకరించలేరు హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: గ్రామ కంఠం భూములు ఎవరి స్వాధీనంలోనైనా ఉంటే, వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదంది. ఒకవేళ చేరిస్తే అది చట్ట విరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. ఓ భూమిని ఒకసారి గ్రామ కంఠంగా వర్గీకరిస్తే, దానిపై ప్రభుత్వం హక్కును కోరజాలదంది.అది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందన్న కారణంతో రిజిస్టర్ చేసేందుకు నిరాకరించడానికి వీల్లేదంది. ఈ మేరకు జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి (ఎస్.వి.భట్) ఇటీవల కీలక తీర్పునిచ్చారు. విజయనగరం జిల్లా, సాలూరు గ్రామం, సర్వే నంబర్ 162/2 (పార్ట్)లోని ఓ ఇంటిని ఎస్.విజయ అనే మహిళ కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్కని సబ్ రిజిస్ట్రార్ను ఆశ్రయించగా.. గ్రామ కంఠం భూమని, నిషేధిత జాబితాలో చేర్చినందువల్ల రిజిస్ట్రేషన్ కుదరదని ఆయన చెప్పారు. దీంతో విజయ హైకోర్టును ఆశ్రయించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి ఎస్.వి.భట్ తీర్పు వెలువరించారు. ‘రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), ఇతర రెవిన్యూ రికార్డులను ఆధారంగా చేసుకుని గ్రామ కంఠం భూములను నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. ఆర్ఎస్ఆర్లోని కాలమ్ 4 ప్రభుత్వ, ఇనామ్ భూముల గురించి చెబుతుంది. ఇందులో ఉన్న వివరాల ఆధారంగా గ్రామ కంఠం భూములపై ప్రభుత్వానికి మాత్రమే యాజమాన్యపు హక్కు ఉంటుందనే తుది నిర్ణయానికి రావడానికి వీల్లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠం (తెలుగు), గ్రామ నాథం (తమిళం) పదాలను ఉపయోగిస్తున్నారు. ఎస్టేట్ , రైత్వారీ గ్రామా ల్లో.. ఇళ్లు, గుడిసెల నిర్మాణానికి కొంత భూమిని కేటాయించే వారు. దీన్ని గ్రామ కంఠంగా వ్యవహరిస్తారు. ఆ భూములు అత్యధిక భాగం ప్రైవేటు వ్యక్తుల వద్దనే ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చడం చట్ట విరుద్ధం.ప్రభుత్వం తమ ఉత్తర్వుల ద్వారా ఎప్పుడో పరిష్కారమైన వాటిని అపరిష్కృతంగా మారుస్తోంది. మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం లేదా ఎస్టేట్స్ చట్టం ప్రకారం చూసినా గ్రామ కంఠం ప్రభుత్వ భూమి కాదు. ఈ కారణంతో రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్ట విరుద్ధం.’ అని జస్టిస్ భట్ స్పష్టం చేశారు.
గ్రామ కంఠం ప్రభుత్వ భూమి కాదు
Published Sat, May 30 2015 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement