వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు

Published Sun, Sep 7 2014 7:56 PM

tight security for ganesh  nimajjanam!

హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ మహీందర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించామన్నారు. సోమవారం నాటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి 30 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. నిమజ్జన దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు.

 

రేపటి నిమజ్జనంలో 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు.దీనికి పోలీసులకు ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement