టిప్పర్‌తో పరారైన వ్యక్తి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

టిప్పర్‌తో పరారైన వ్యక్తి అరెస్ట్

Published Mon, Oct 19 2015 3:23 PM

Tipper thief arrested

రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టిప్పర్ మాయం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నార్సింగ్‌లో రెండు నెలల క్రితం టిప్పర్ అదృశ్యం కాగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితుడు శివాజీని పోలీసులు సోమవారం నార్సింగ్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement