'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం' | Sakshi
Sakshi News home page

'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం'

Published Fri, Aug 1 2014 11:17 AM

'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం'

హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తమ ఉద్యోగులు ఏవరూ పనిచేయరని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు.

ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్‌ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది.
 

Advertisement
Advertisement