మంత్రి పోచారానికి సంఘం ప్రతినిధుల వినతి
సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మంతూరి బాల్నర్సయ్య అధ్వర్యంలో వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిని బుధవారం హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంతూరి బాల్నర్సయ్య గురువారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, చేపల విక్రయాలకు ప్రతి మండల కేంద్రంలో మార్కెట్ స్టాల్స్ నిర్మించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో శీతల గిడ్డంగి నిర్మించాలని, ప్రతి రోజు మీడియాలో, పత్రికల్లో చేపల మార్కెట్ ధరల వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించాలని, సంఘాల పరిధిలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పెంచుకునేందుకు ఉచితంగా సరఫరా చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ ప్రతులను ముఖ్యమంత్రికి, భారీ నీటి పారుదల శాఖ మంత్రికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, బైరయ్య, లింగం, రాజు, మల్లేశం, శంక ర్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్య సహకార సంఘాల సమస్యలను పరిష్కరించాలి
Published Thu, Jun 19 2014 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement