సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం సర్వే ప్రారంభం కానుండగా.. అధికారులు మాత్రం సోమవారం రాత్రి నుంచే పల్లెలకు చేరుకున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.10 లక్షల కుటుంబాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 25లక్షల జనాభా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం 28 వేల మంది ఎన్యూమరేటర్లను నియమించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది.
పక్కాగా.. పకడ్బందీగా
సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను పక్కా సమాచారంతో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతాన్ని 380 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేసింది. మొత్తం 8.10 లక్షల కుటుంబాలకు గాను 8.30 లక్షల సర్వే పత్రాలను ముద్రించి మండల కేంద్రాలకు తరలించింది. కుటుంబ సభ్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, వారి ధ్రువీకరణ ప్రతాలను చూసిన తర్వాతే వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు, హాస్టళ్లలో చదివేవారు మాత్రం అందుబాటులో లేనప్పటికీ ధ్రువీకరణతో నమోదు చేసుకోనున్నారు.
ఉదయం 6గంటల నుంచే..
సర్వే ప్రక్రియలో భాగస్వాములయ్యే సిబ్బంది మంగళవారం ఉదయం 6గంటలకే మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న ఉద్యోగులు అల్పాహారం పూర్తి చేసుకుని సర్వే మెటీరియల్ను తీసుకుని ఏడు గంటలకు బయలుదేరుతారు. వీరిని గ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం 1,300 బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటలకు వివరాల సేకరణ మొదలు పెట్టిన ఉద్యోగులు.. వారికి నిర్దేశించిన కుటుంబాల నుంచి సాయంత్రం 6గంటల లోపు వివరాలు సేకరించాలి. అనంతరం వాటిని క్లోజ్ చేస్తూ సమాచారాన్ని ప్రత్యేకాధికారికి అందించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ అంతా రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలి. అలా వచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా స్థాయిలో సర్వే చేసిన సంఖ్యపై రాత్రి 9గంటలకు స్పష్టత వస్తుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా సర్వే ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
నేడే ‘సర్వే’
Published Mon, Aug 18 2014 11:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement