వస్తు, సేవల్లో నాణ్యతా లోపాలుంటే నిలదీయొచ్చు
చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన బాధ్యత వినియోగదారులదే
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
వరంగల్ బిజినెస్ : వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడేందుకు మూల కారకుడు వినియోగదారుడే. అతడి అభిరుచే వ్యాపార సంస్థలకు ప్రామాణికం. వినియోగదారుడు మార్కెట్లో రకరకాల వస్తువులను కొని వినియోగిస్తుంటాడు. ఈక్రమంలో ఏవైనా లోటుపాట్లు కనిపిస్తే ఆ వస్తువును లేదా సేవను అందించిన సంస్థను ప్రశ్నించే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. అయినప్పటికీ వినకుంటే చట్టపరం గా వారిపై పోరాడేందుకు అవకాశం ఉంది. నేడు(మంగళవారం) 33వ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిది.
ఐక్యరాజ్య సమితి ఆమోదంతో..
వినియోగదారుల హక్కుల ముసారుుదాను 1962 సంవత్సరంలో రూపొందిం చారు. దానికి ఐక్యరాజ్య సమితి 1983 సంవత్సరం మార్చి 15న ఆమోదం తెలి పింది. నాటి నుంచి ఆ రోజును ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
1986 సంవత్సరంలో వినియోగదారుల హక్కుల చట్టానికి భారత పార్లమెంట్ ఆ మోదం తెలిపింది. అనంతరం వ్యాపారుల చేతిలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు జిల్లాలవారీగా విని యోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పడ్డారుు. వరంగల్ జిల్లాలో విని యోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా 7 సంస్థలు పనిచేస్తున్నారుు. వాటిలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఒకటి. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంతో పాటు నెక్కొం డ, జనగాం, మహబూబాబాద్ వినియోగదారుల మండళ్లు విశేష సేవలందిస్తున్నారుు.
వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రరుుంచడమిలా..
మీరు ఏదైనా ఒక వస్తువును కొని ఉండొచ్చు.. లేదా ఒక సంస్థ నుంచి సేవను పొంది ఉండొచ్చు. దానిలో నాణ్యతా లోపాన్ని గానీ.. తూకాల్లో తేడా గానీ.. సేవల్లో వైఫల్యాన్ని గానీ.. నకిలీదని గుర్తిస్తే దానిపై విక్రరుుంచిన వ్యాపారిని నిలదీయొచ్చు. వారు స్పందించకుంటే జిల్లా వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించాలి. వినియోగదారులు రూ. 20 లక్షలలోపు పరిహారం పొందాలనుకుంటే జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటి దాకా పరిహారం కోసం రాష్ట్ర ఫోరంలో, రూ.కోటికిపైన నష్టపరిహారం కోసం జాతీయ కమిషన్లో ఫిర్యాదును నమోదు చేయొచ్చు.
చట్టాలు ఉన్నా ఫలితం లేదు
పుట్టిన వ్యక్తి దగ్గరి నుంచి చనిపోయే వ్యక్తి వరకు ప్రతిఒక్కరూ వినియోగదారుడే. అందుకే ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. అవి ఉన్నా ఫలితం ఏమీ కన్పించడం లేదు. ఈ మేరకు వినియోగదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
- సాంబరాజు చక్రపాణి, జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షుడు
విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలి
ఇతర దేశాల్లో నిషేధించిన వస్తువులను మన దేశానికి దిగుమతి చేసి అమ్ముకోవడానికి బహుళజాతి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వీటి వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది. వినియోగదారుడు చైతన్యవంతుడు అయినప్పుడే మోసపోడు.
- డాక్టర్ పల్లెపాడు దామోదర్, ఉపాధ్యక్షుడు రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య
అవగాహనే ఆయుధం
Published Tue, Mar 15 2016 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement