చార్జీలు అమాంతం పెంపు
మే నెల నుంచి అమలు
కొత్త ఏజెన్సీ కోసం టెండర్ల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్ల చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్రోడ్డుపై ప్రయాణం ఇకపై మరింత భారం కానుంది. టోల్ ట్యాక్స్ (దారి సుంకం) చార్జీలను పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) నిర్ణయం తీసుకొంది. పెంచిన ధరలను మే నెల నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త రేట్ల ప్రకారం వాహనాన్ని బట్టి రూ. 10 నుంచి రూ. 60 వరకు అదనపు వడ్డింపు ఉండనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 119.45 కి.మీ. ఔటర్ రింగ్రోడ్డుపై 17 చోట్ల టోల్ట్యాక్స్ వసూలు చే స్తున్నారు. వాహనాన్ని బట్టి ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ వరకు ప్రయాణానికి రూ.10 నుంచి రూ. 70 వరకు చార్జీ వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు... కారులో పటాన్చెరు నుంచి పెద్దఅంబర్పేట వరకు ఔటర్పై ప్రయాణిస్తే పెరగనున్న ధరల ప్రకారం రూ.80 వరకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ దూరానికి రూ.70లు టోల్ట్యాక్స్ ఉంది. అలాగే ప్రస్తుతం మినీ బస్సులకైతే రూ. 110, బస్సు లేదా 2యాక్సిల్ ట్రక్లకు రూ.230లు, 3 యాక్సిల్, కమర్షియల్ వాహనాలకు రూ.260 చొప్పున చార్జీ ఉంది. వీటిపై కూడా పెరిగిన ధరల మేరకు అదనపు భారం పడనుంది.
టోల్ వసూలు కోసం టెండర్ల ఆహ్వానం
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరం చుట్టూ 158 కి.మీ. మేర ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణం తలపెట్టగా... ఇప్పటికే 124 కి.మీ. రోడ్డు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెద్దఅంబర్పేట నుంచి శంషాబాద్ మీదుగా శామీర్పేట వరకు నార్సింగి (నానక్రామ్గూడ- గచ్చిబౌలి లింక్ను కలిపి), పటాన్చెరు, దుండిగల్, మేడ్చెల్ వరకు 119.45 కి.మీ మేర ఔటర్పై టోల్ట్యాక్స్ వసూలు బాధ్యతను పీకే హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థతో కుదుర్చుకొన్న ఒప్పందం గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. దీంతో హెచ్ఎండీఏ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో ఔటర్పై మ్యాన్యువల్గా టోల్ వసూలుకు టెండర్లను ఆహ్వానిస్తూ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఔటర్పై అత్యాధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటు కావడానికి 18 నెలలు సమయం పట్టనుండడంతో... అప్పటివరకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసేందుకు హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. నెలకు రూ. 2.94కోట్లు కనీస మొత్తంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు చేసుకొనేందుకు ఏప్రిల్ 26 ఆఖరు తేదీగా నిర్ణయించింది. అదే రోజు తార్నాకలోని ఓఆర్ఆర్ కార్యాలయంలో టెక్నికల్ బిడ్స్ తెరచి అర్హత గల సంస్థలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ తెరచి అర్హత కలిగిన సంస్థకు టోల్ వసూలు కాంట్రాక్టును అప్పగిస్తారు.
‘ఔటర్’పై మళ్లీ టోల్ బాదుడు
Published Thu, Mar 27 2014 3:18 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement