సాక్షి, జగిత్యాల: తెలంగాణలో తక్కువ టెస్ట్లు చేస్తున్నందువల్లే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ... ‘పక్క రాష్ట్రాల్లో 2 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణ లో కేవలం 22 వేల టెస్టులు మాత్రమే చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం లేదు. ఐ సీ ఎం ఆర్ ప్రైవేట్ ఆసుపత్రులలో టెస్టులు చేయాలని చెబితే హైకోర్టు చెప్పేవరకు రాష్ట్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తప్పుడు ధోరణి వల్లనే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 5 వేలు టెస్టులు చేయాల్సి ఉంటే కేవలం 200 మాత్రమే చేస్తున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఇక మీరు వాళ్లకు ఎం తిండి పెడతారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వలస కులీలకు రవాణా ఖర్చులు చెల్లించినందుకు అభినందిస్తున్నాను. కేంద్రం నుండి వివిధ వర్గాల నుండి వచ్చిన విరాళాల వివరాలు చెప్పమంటే చెప్పట్లేదు. కరోనాకు ఎంత ఖర్చు చేశారో కూడా చెప్పట్లేదు. 6 ఏళ్లుగా అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. రాష్ట్రం కరోనా వల్ల అప్పులపాలు కాలేదు. రాష్ట్ర ప్రజలను, బండ్లను కుదువపెట్టి 4 వేల కోట్లు అప్పు తెచ్చారు. మహ్మద్ బిన్ తుగ్లక్ కంటే కేసీఆర్ ఎక్కవ చెబుతున్నారు’ అని ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. (కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం)
ఇంకా ఆయన మాట్లాడుతూ... కందులు కొని 3 నెలలు గడిచినా ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ మళ్ళీ కంది పంట వేయమంటరా? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకంలో మోసం జరిగిందని ఆరోపించారు. హుజూర్నగర్లో ఎన్నికలు వున్నాయని రైతుబందు ఇచ్చారన్నారు. మొట్టమొదటిసారి క్రాప్ ఇన్సూరెన్స్ లేదని, రాష్ట్రంలో రైతులను దేవుడికి వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏందాకైనా పోరాడుతుందని చెప్పారు. పత్తి విత్తనాల కంపెనీలతో ప్రభుత్వానికి లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. పత్తి 7 వేలకు కొంటేనే వేయమని చెప్పాలని, నూనె గింజలకు, పప్పు ధాన్యాలకు తగిన ధర ఇచ్చినప్పుడే పంటలు వేయమని చెప్పాలి అని ఉత్తమ్కుమార్ అన్నారు. (కేసీఆర్కు ఫ్యాషన్గా మారింది: వివేక్)
‘తగిన ధర ఇచ్చినప్పుడే పంటలు వేయమని చెప్పాలి’
Published Thu, May 21 2020 3:33 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement