మంచిర్యాల సిటీ : వేద మంత్రాలు, ఏడడుగులు, తలంబ్రాలు, కొత్తబట్టలు, బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, మిత్రుల నృత్యాలు, అప్పగింతలు, విందు భోజనం.. ఇదీ పెళ్లి జరిపించే సంప్రదాయం. నాటి కాలంలో మొదలైన ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆధునిక యుగంలోనూ నేటి యువత నాటి సంప్రదాయాన్నే గౌరవిస్తూ.. ఆ పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటోంది.
గుడిలో దండలు మార్చడం, రిజిష్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలతో సరిపెట్టుకుపోవడం వరకు కాలం మారినా సంప్రదాయానికి తమ ఓటు అని అంగీకరిస్తున్నారు. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ నూరేళ్ల పాటు గుర్తుగా ఉంచుకోడానికి సంప్రదాయాన్ని మరువడం లేదు. కాలంతోపాటు మనుషులూ మారుతున్నారు. వారి జీవన శైలీ మారుతోంది. ఆస్తులు, అంతస్తులు పెరిగి పోతున్నాయి. వ్యక్తుల స్థోమతకు తగిన విధంగా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపిస్తున్నారు.
వరపూజ..
అబ్బాయి, అమ్మాయికి ఒకరికి ఒకరు ఇష్టమైన తరువాత జరిగే మొదటి కార్యక్రమం వరపూజ. మంచి శుభదినాన్ని ఎంపిక చేసి శుభలేఖను రాసి పండితులు వధూవరుల పెద్దలకు అందజేస్తారు. ఇరువురి ఇంట్లో భోజనాలు చేస్తారు. ఒకరికొకరు కొత్త బట్టలు పెట్టుకుంటారు.
గణపతి పూజ..
వివాహంలో తొలి పూజ. ప్రతి పూజా కార్యక్రమంలో గణపతి పూజ చేయడం హిందూ సంప్రదాయం. వధూవరులకు ఎలాంటి కష్టాలు రానివ్వరాదని కోరుతూ చేసే పూజ ఇది.
గౌరీపూజ..
వధువుకు సంబంధించిన పూజ ఇది. సకల దేవతలకు పూజనీయురాలైన గౌరీ మాతను పూజించడం సంప్రదాయం. ఈపూజతో అష్టైశ్వర్యాలు కలిగి వివాహ బంధంలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం.
సుముహూర్తం
వివాహ వేడుకకు లగ్న పత్రికలో పెట్టుకున్న ముహూర్తానికి అనుగుణంగా జీలకర్ర బె ల్లం తల మీద వధూవరులు పెట్టుకోడమే అసలైన సుముహూర్తం. దీన్నే ముహూర్త బలం అంటారు. దీంతో వధువు వరుడి సొంతం అయినట్టుగా భావించాలి.
అరుంధతి నక్షత్రం
పెళ్లి ముహూర్తం రాత్రి, పగలుతో సంబంధం లేకుండానే అరుంధతి నక్షత్రాన్ని వధూవరులకి చూపిస్తారు. ఈ నక్షత్రాన్ని చూడటం వలన దంపతుల సంసారం సుఖఃశాంతులతో ఉంటుందని నమ్మకం.
తలంబ్రాలు
వివాహనికి చివరి అంకం ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం. సంసార నౌకకు ఇద్దరూ సమానమే. ఒకరికి ఒకరు సమానమే. పసుపుతో కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు అంటారు. వీటిని వధూవరులు ఒకరి తలపై ఒకరు ఆనందంగా పోసుకుంటారు. కష్టం, సుఖం ఇద్దరికీ సమానమనే భావం కలిగించేది తలంబ్రాలు.
వేద మంత్రాలు.. ఏడడుగులు..
Published Mon, Aug 11 2014 12:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement