తాండూరు రూరల్: సంక్రాంతి పండుగపూట ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పండుగ సామగ్రి తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన తాండూరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముండే అయినపురం మొగులప్ప(52) స్థానికంగా ఓ కిరాణం దుకాణం నిర్వహిస్త్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
బుధవారం మధ్యాహ్నం ఆయన తాండూరుకు వచ్చి పండుగ సామగ్రి కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇందిరాచౌక్ వద్ద రోడ్డు దాటుతుండగా తాండూరు నుంచి డిపోకు వెళ్తున్న వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు(ఏపీ 28జడ్2598) ఆయనను ఢీకొంది. దీంతో బస్సు టైర్ల కిందపడిన మొగులప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు.
మొగులప్ప మృతి విషయం తెలుసుకున్న ఆయన కుటుంబీకులు, బంధువులు రాజీవ్కాలనీవాసులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఎస్ఐ అభినవ చతుర్వేది వారికి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
పట్టణ ఇన్చార్జి సీఐ శివశంకర్, ఎస్ఐలు నాగార్జున, ప్రణయ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఘటనా స్థలానికి రావాలని, రూ.10 లక్షల పరిహారం ఇచ్చి మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సీఐ శివశంకర్ వారికి సర్దిచెప్పారు.
నష్టపరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు శాంతించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీకాంత్ తాండూరు ఆస్పత్రికి చేరుకొని మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. సంస్థ నుంచి పరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. మృతుడికి భార్య శకుంతల, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు..
తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శి కృష్ణముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
పండుగపూట విషాదం
Published Thu, Jan 15 2015 4:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement