మెదక్ రూరల్ : క్యాన్సర్ వ్యాధి సోకి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ తన ఇంట్లో చనిపోతుందేమోనని భయపడి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో తలదాచుకునేందుకు కనీసం పూరిపాకైనా లేకపోవటంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను ఆమె భర్త నడిరోడ్డుపై పడుకోబెట్టి గుండెలవిసెలా రోదిస్తున్నాడు. 'భగవంతుడా... నాలాంటి పాపపు రాత ఎవరికీ రావద్దు దేవుడా' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామానికి కొంతదూరంలో పోచమ్మగుట్ట దేవాలయం ఉంది. దేవాలయానికి దగ్గర్లోనే రాములు, అంజమ్మ దంపతులు పూరిపాక నిర్మించుకుని ఉంటున్నారు. రెండేళ్ల క్రితం అంజమ్మకు క్యాన్సర్ వచ్చింది. దీంతో రాములు తలకు మించిన అప్పులు చేసి ఆస్పత్రులకు తిప్పాడు. ఈ క్రమంలోనే పోచమ్మ ఆలయం వద్ద వేసుకున్న పూరిపాక పూర్తిగా కూలిపోవటంతో కొన్ని నెలల క్రితం పేరూర్ గ్రామానికి వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొన్ని రోజులుగా అంజమ్మ పరిస్థితి విషమించింది. దీంతో తమ ఇంట్లో మరిణిస్తుందనే ఉద్దేశంతో ఇంటి యజమాని వారిని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భార్యను రాములు ఓ ఆలయం పక్కనే గల రోడ్డుపై పడుకోబెట్టి కన్నీటి పర్యంతమవుతున్నాడు.
ఆస్పత్రిలో చూపించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక, కనీసం మందుబిళ్లలకు డబ్బుల్లేక తన భార్య కళ్ల ముందే చస్తుంటే ఏం చేయలేని నిర్భాగ్యుడనయ్యానంటూ రాములు ఆవేదన చెందుతున్నాడు. చలించిన గ్రామ సర్పంచ్ ర్యావ సుగుణ కుమారుడు రాంచందర్రెడ్డి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో పూరిగుడిసెను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
క్యాన్సర్ వీధిన పడేసింది
Published Mon, Aug 3 2015 4:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement