అశ్వారావుపేటలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

అశ్వారావుపేటలో ఉద్రిక్తత

Published Sat, Jun 27 2015 1:01 PM

tribes attack on Wood plantation

అశ్వారావుపేట: అటవీ శాఖ పరిధిలోని టేకు ప్లాంటేషన్ నరికివేసేందుకు గిరిజనలు యత్నించారు. దీంతో అటవీ అధికారులకు గిరిజనలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం అశ్వారావు పేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని రామన్న గూడెం గిరిజనలు తమకు చెందిన లంకపల్లి భూముల్లో అటవీ అధికారుల టేకు ప్లాంటేషన్ చేశారని, వాటిని నరికివేసేందుకు ప్రయత్నించారు.  ఈ క్రమంలో అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement