వరంగల్, న్యూస్లైన్ : స్థానిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణను టీఆర్ఎస్ సిద్ధం చేసిం ది. మునిసిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంప్ల నిర్వహణ తదితర అంశాలను సమన్వయం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిలకు స్థానం కల్పించారు. జెడ్పీటీసీల బాధ్యత జిల్లా అధ్యక్షుడికి, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ల భాధ్యత పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు అప్పగించారు. జెడ్పీ చైర్మన్, వైఎస్ చైర్మన్లను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ ఫలితాలు రాగానే విజయం సాధించిన అభ్యర్థులు 17వ తేదీన తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్రెడ్డి, అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసిన అభ్యర్థులు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, వినయభాస్కర్, డాక్టర్ రాజయ్య, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అజ్మీరా చందూలాల్, మధుసూదనాచారి, కొండా సురేఖ, సహోదర్రెడ్డి, శంకర్నాయక్, డాక్టర్ సుధాకర్రావు, సత్యవతిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయం కోసం త్రిసభ్య కమిటీ
Published Sat, May 10 2014 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement