► సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తాం: కేటీఆర్
► బడ్జెట్లో చేనేతకు భారీ కేటాయింపులు చేశాం
► 14,300 చేనేత మగ్గాలకు జియోట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులను కాపాడు కోవడమే ప్రభుత్వ చేనేత విధాన ప్రాథమిక లక్ష్యమని చేనేతశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. చేనేత రంగంలో లాభదా యకత లేకుంటే ఇతర రంగాలకు తరలి వెళ్లేందుకు కూడా తాము సహకారం అందిస్తామని అన్నారు. బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో చేనేత, టెక్స్టైల్ శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ.. ఇతర రంగాల్లోకి వెళ్లే కార్మికులకు ప్రత్యేక సబ్సిడీలతో కూడిన రుణాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని, చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయిం పులు చేశామన్నారు. ఇందులో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని, ఆధార్, బయో మెట్రిక్ ఆధా రంగా నేరుగా వారి బ్యాంకుల్లో సబ్సిడీ చేరేలా పాలసీలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
చేనేత డైరెక్టరీ తయారు చేయాలి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేనేత స్థితిగతుల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి, చేనేత డైరెక్టరీని తయారు చేయాలని సూచించారు. ఈ నివేదికలో రాష్ట్రంలో ఉన్న చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలతో కూడిన పూర్తి గణాంకాలు, అంచనాలతో కూడిన సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో నిర్వహిస్తున్న చేనేత మగ్గాల సర్వేలో 17,000 చేనేత మగ్గాలున్నాయని.. ఇప్పటికే 14, 300 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు మంత్రి తెలిపారు.
చేనేతలకు సబ్సిడీలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. తమ ఉత్ప త్తులను ప్రభుత్వానికే కాకుండా బయట మార్కెట్లో అమ్ముకునే అవకాశాన్ని సైతం కల్పిస్తామని, ప్రభుత్వమే మాస్టర్ వీవర్ పాత్రను పోషించాలని మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్టైల్ డైరెక్టర్ శైలజారామయ్యర్తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చేనేతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Published Thu, Apr 13 2017 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement