కరీంనగర్, న్యూస్లైన్ : సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి ఆదర్శవంతమైన పాలన అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలోని ప్రతిమా మల్టిప్లెక్స్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఎంపీ వినోద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి జిల్లా మొదటినుంచి వెన్నుదన్నుగా నిలిచిందని, ఇప్పుడు కూడా 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అందించి అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపజేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. మార్పు కోసం పోరాటం అనే లక్ష్యంతో అభివృద్ధి అనే ఉద్యమంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ , తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఎన్నికల హామీలైన నిరుపేదలకు ఇళ్లు, పింఛన్లు, లక్ష రూపాయల రుణమాఫీలను అమలు చేస్తామన్నారు.
ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం 20 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గన్నీ సంచులు, లారీలు ఏర్పాటు చేసి త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై సివిల్ సప్లయ్స్ ఎండీతో మాట్లాడతామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రూ.350 కోట్ల నిధులతో తాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్రెడ్డి, పుట్ట మధు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, నాయకులు రవీందర్సింగ్, చల్లా హరిశంకర్, బోనాల శ్రీకాంత్, నేతికుంట యాదయ్య, పెద్దపల్లి రవీందర్, కఠారి రేవతిరావు, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, కట్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యేల బృందం
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, దాసరి మనోహర్రెడ్డి, పుట్ట మధుకర్ తదితరులు బుధవారం కలెక్టర్ వీరబ్రహ్మయ్యను కలిసి వినతిపత్రం అందించారు. కొనుగోళ్లు ఆలస్యమై కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. మిగతా ధాన్యాన్ని గోదాములకు తరలించి రైతులను ఆదుకోవాలన్నారు.
ఎమ్మెల్యేలకు సన్మానం
కలెక్టరేట్ : ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలను కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య సన్మానించారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, పుట్ట మధుకర్ బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదర్శపాలన అందిస్తాం
Published Thu, May 22 2014 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement