రేపు టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక: కేసీఆరే అధ్యక్షుడు | Sakshi
Sakshi News home page

రేపు టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక: కేసీఆరే అధ్యక్షుడు

Published Sun, Apr 19 2015 8:40 PM

కె.చంద్రశేఖర రావు - Sakshi

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రేపు మధ్యాహ్నం జరుగనున్నాయి. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎన్నిక లాంఛనం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వ ప్రారంభమవుతుంది. కేసీఆర్ తరపున మంత్రులు, ముఖ్య నేతలు ఆరు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయరు. కేసీఆరే మళ్లీ అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు.

టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. గ్రేటర్ అధ్యక్షేనిగా మైనంపల్లి హన్మంతరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.

ఇదిలా ఉండగా, కేసీఆర్, కె.కేశవరావు సమావేశమయ్యారు. వారు ఇద్దరూ దాదాపు మూడు గంటల నుంచి సమావేశమయ్యారు. ప్లీనరీలో రాజకీయ తీర్మానాలపై చర్చించారు. ఏపీతో వివాదాలు, జాతీయ రాజకీయాలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. 25కు పైగా తీర్మానాలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement