మొదటిసారిగా రూ.4వేల ధర ప్రకటించిన ప్రభుత్వం
పెట్టుబడి పెరగడంతో నష్టపోతున్న రైతులు
వరంగల్ సిటీ, న్యూస్లైన్,జిల్లాలో పసుపు సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ఇప్పటికే సాగు కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేసిన రైతులు కనీస ధర లభించకపోవడంతో ఆవేద న చెందుతున్నారు. రెండు నెలల క్రితం నుంచి మార్కెట్లకు పసుపు వస్తుండగా... ప్రభుత్వం ఎన్నడూలేని విధంగా పసుపు క్వింటాల్కు రూ.4 వేలుగా ఎంఎస్పీ ధర నిర్ణయించింది. అయితే, కనీసం రూ.5వేల ధర నిర్ణయిస్తే లా భం జరిగేదని రైతులు చెబుతున్నారు.
గతంలో రూ.10వేలు
రెండేళ్ల క్రితం పసుపు క్వింటాల్కు రూ.10వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు పసుపు సాగుపై ఆసక్తి పెంచుకోగా.. గత ఏడాది మా త్రం రూ.4వేల నుంచి రూ.5వేల వరకే ధర లభించింది. ఆ సంవత్సరం వరంగల్ మార్కెట్కు 50,845 క్వింటాళ్ల పసుపు వచ్చింది. దీంతో ఈసారి ఎలా ఉంటుందోనని రైతులు బెంగ పడుతున్నట్లుగానే ప్రభుత్వం రూ.4వేల ధర నిర్ణయించడంతో..
వ్యాపారులు కూడా కొ ద్దిగా అటూఇటు ఇదే ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇచ్చేది కూడా ఇంతేనని దబాయిస్తుండడం చేసేదేం లేక రైతులు పసుపు అమ్ముకుని నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరికొందరు మాత్రం ధర పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేసముద్రంలోనూ అదే తీరు..
కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పసుపు అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ సీజన్ అడపాదడపా పసుపు వస్తుండగా.. బుధవారం నాలుగు వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. గత ఏడాది క్వింటాల్ పసుపు రూ.3200 నుంచి రూ. 4వేల వరకు ధర లభించగా, రైతులు నష్టపోయారు.
ఈసారి అకాల వర్షాలతో పసుపు దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ లో బుధవారం కాడి రకం క్వింటాల్కు రూ.5725-రూ.4631, గోల రకానికి రూ.5800-రూ.4600 ధర లభించింది. ఇలా కనీసం గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతుండగా.. కాం టాలు సరిగ్గా సాగక రాశుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ఈసారి ఎంతగానో ఆశపడ్డాను
గత సంవత్సరం పసుపు ధర భాగా తగ్గడంతో ఈ ఏడాది మంచి ధర లభిస్తుందని ఆశపడి సాగు చేశాను. కానీ ధర ఏ మాత్రం పెరగకపోవడంతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి. నేను చేసిన అప్పులు మిగిలేలా ఉన్నాయి.
- అనుముల సంజీవ, మొండ్రాయి
ఇక పసుపు సాగుచేయను
ఎంతో కష్టపడి ఎక్కువ పెట్టుబడితో పసుపు సాగు చేస్తే అందులో సగం కూడా ధర రావడం లేదు. ఇక నుంచి పసు పు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నా. ఐదేళ్లుగా పసుపు సాగు చేస్తున్న నాకు ఎప్పుడూ ఓ ఇబ్బంది ఎదురవుతోంది.
- గుగులోతు బిక్షపతి, దీక్షకుంట్ల
పసుపు రైతులకు కష్టకాలమే..
Published Thu, Apr 17 2014 4:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement