గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి | Sakshi
Sakshi News home page

గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Published Fri, May 15 2015 6:59 PM

గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - Sakshi

సంగారెడ్డి : ప్రమాదవశాత్తూ జేసీబీ తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు శుక్రవారం మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలో కల్పగూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... కల్పగూరు గ్రామ సర్పంచి ఇటీవల గ్రామంలో రహదారులను బాగుచేయించడానికి మట్టిని తీయించారు. జేసీబీ సహాయంతో మట్టిని తీయడంతో అక్కడ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం వర్షం పడటంతో అక్కడి గుంతలు నీళ్లతో నిండాయి.  

ప్రణీత్ కుమార్(10), అభిషేక్(6) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ దాంట్లో పడిపోయి మృత్యువాతపడ్డారు. మరుసటిరోజే అభిషేక్ పుట్టినరోజు. పుట్టిన రోజు జరుపుకోవాల్సిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రణీత్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో వారు  శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement