రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Sun, Jan 31 2016 10:49 AM

two died in nizamabad road accident

మాచారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మాచారెడ్డి మండలం భవానీపేట వద్ద ఓ కారు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయపడినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలతో పాటు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement