బోలేరోను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం | Sakshi
Sakshi News home page

బోలేరోను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం

Published Sun, Jan 24 2016 3:22 PM

బోలేరోను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం - Sakshi

ములుగు: వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బోలేరో వాహనాన్ని ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వరంగల్ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న లారీ ములుగులోని మహర్షి డిగ్రీ కళాశాల ఎదుట ఏర్పాటుచేసిన పోలీస్ బారీ కేడ్స్‌ను తప్పించే యత్నంలో బోలేరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బోలేరోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు బారీకేడ్స్ ఏర్పాటు చేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ.. రాస్తారోకో నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

Advertisement
Advertisement