ఆర్టీసీ అద్దె బస్సు - బైక్ ఢీ: ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అద్దె బస్సు - బైక్ ఢీ: ఇద్దరు మృతి

Published Thu, May 7 2015 11:37 AM

Two killed in road accident

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ అద్దె బస్సు గురువారం బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. దాంతో ఆర్టీసీ కార్మికులు, స్థానికులు రహదారిపై ఆందోళనకు దిగారు. సరైన శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఫిట్మెంట్ 43 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులను నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో డ్రైవర్, కండెక్టర్లుగా పని చేసేందుకు తాత్కాలిక ఉద్యోగులను ఆర్టీసీ నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement