తామర పూల కోసం వెళ్లి..  | Sakshi
Sakshi News home page

తామర పూల కోసం వెళ్లి.. 

Published Sat, Oct 7 2017 1:12 PM

two students died in mahabubabad

సాక్షి, మహబూబాబాద్‌: తామర పూల కోసం చెరువులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని కొత్తగూడెం మండలం ఒటాయి పెదతండాలో శనివారం వెలుగుచూసింది. తండాకు చెందిన గుగులోతు సాయికుమార్‌(14), గుగులోతు రాజు(12) నర్సంపేటలోని గురుకుల పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు.

దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన విద్యార్థులు గ్రామ శివారులోని సాదిరెడ్డిపల్లి చెరువులో తామర పూలు తేవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రాజు నీట మునిగి పోతుండగా.. సాయి అతన్ని కాపాడటానికి యత్నించాడు. దీంతో ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Advertisement
Advertisement