రంగారెడ్డి: డబ్బు కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి జీవిత ఖైదుతోపాటు రూ.2వేల జరిమానా చొప్పున విధిస్తూ మూడో అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శనివారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... నాచారం ప్రాంతంలో నివాసముండే రిటైర్డ్ ఎమ్మార్వో జోగారెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికీ పెళ్లిళ్లు కావటం, భార్య చనిపోవటంతో జోగారెడ్డి తన ఇంట్లో ఒంటరిగానే ఉండేవారు. ఆ ఇంట్లో వీరమణి అనే మహిళ పని మనిషిగా ఉండేది. ఈ క్రమంలో జోగారెడ్డి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడు. కొంతకాలం పనిచేసిన వీరమణి తన సొంత గ్రామమైన మెదక్ జిల్లా రామాపూర్ వెళ్లిపోయింది.
అయితే, జోగారెడ్డి వద్ద ఉన్న డబ్బు కాజేసేందుకు వీరమణి పథకం పన్నింది. ఆ మేరకు అతడిని 2010 జూలై 27న తన ఇంటికి రప్పించుకుంది. వీరమణి, ఆమె అల్లుడు మల్లేష్ కలిసి జోగారెడ్డికి అతిగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న జోగారెడ్డిని చున్నీతో మెడకు బిగించి హత్య చేశారు. శవాన్ని దగ్గరలోనే మంజీరా షుగర్ ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి కాల్చివేశారు. ఈ విషయం ఆరు నెలల వరకు ఎవరికీ తెలియకుండా ఉంది.
ప్రతి ఏటా జోగారెడ్డి తన మనవడి పుట్టినరోజున ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాడు. 2011 జనవరిలో మనవడి పుట్టినరోజుకు ఫోన్ చేయకపోవడంతో నగరంలోనే ఉండే ఆయన కూతురు సంధ్యకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె నాచారంలోని జోగారెడ్డి ఇంటికి వెళ్లి చూసింది. అక్కడ తండ్రి లేకపోవటంతో నాచారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వీరమణిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. తన అల్లుడు మల్లేష్తో కలిసి డబ్బు కోసం జోగారెడ్డిని హత్య చేసి కాల్చివేసినట్లు నేరాన్ని అంగీకరించింది. నాచారం పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్జి హేమంత్కుమార్ పైవిధంగా తీర్పు చెప్పారు.
హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
Published Sat, Jun 25 2016 5:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement