సాక్షి, హైదరాబాద్: నగరంలో లండన్ మహిళతో ఉబర్ క్యాబ్ డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. వివరాలివి.. లండన్ మహిళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఉబర్ క్యాబ్ను బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన అనుమానంగా ఉండటాన్ని గమనించి వెంటనే ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో క్యాబ్ డ్రైవర్ భయంతో కారును ఇంకా వేగంగా నడిపాడు. ఇద్దరి మధ్య వెళ్లే మార్గంలో వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు రంగంలోకి దిగి క్యాబ్ డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.