కందుకూరు/ కడ్తాల (మహబూబ్నగర్) : పండగకు ముందు రోజు ఓ ఇంటి తీవ్ర విషాదం అలుముకుంది. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు, వారి మేనమామ దుర్మరణం చెం దారు. వివరాల్లోకి వెళితే.. కందుకూరు మండలం శాయిరెడ్డిగూడెంలో శ్రీలత, చిందం శ్రీశైలం దంపతులకు కూతురు శ్రీజ (8), మణికంఠ (5) ఉన్నారు. ముచ్చర్ల గేట్ సమీపంలోని అక్షరజ్యోతి పాఠశాలలో శ్రీజ 2వ తరగతి, మణికంఠ ఎల్కేజీ చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం రావిచేడ్కు చెందిన నరేష్ (28) (శ్రీలత సోదరుడు) సంక్రాతి పండగకు చెల్లెలు, బావలను తీసుకెళ్దామని మంగళవారం ఉదయం బైక్పై సాయిరెడ్డిగూడెం వచ్చాడు.
అయితే వ్యవసాయ పనులున్నందున పండగ రోజు వస్తామని వారు చెప్పడంతో మేనల్లుడు, మేనకోడలితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి 7.30 గంటలకు ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మగడ్డతండా గేటు వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం అతివేగంతో వచ్చి ఢీకొనడంతో మామతో పాటు మేనల్లుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్ర గాయాల పాలైన శ్రీజను చుట్టుపక్కలవారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.
ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకుని సీఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐలు సాయికుమార్, రాంబాబు పరిశీలించి కేసు దర్యాప్తు చే పట్టారు. కాగా, నరేష్కు భార్య కొమురమ్మతో పాటు కూతురు లక్కీ, కుమారుడు చింటు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడ మేనమామ, మేనల్లుడు విగత జీవులుగా పడి ఉండడం చూసి వారు కంటతడిపెట్టారు. మరికాసేపట్లో మామయ్య ఇంటికి వెళ్తామని సంతోషంగా ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో రావిచెడ్, శాయిరెడ్డిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడుపుకోత
Published Wed, Jan 13 2016 12:09 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ
పథకాల నగదును చంద్రబాబే ఆపించారు
వ్యాపారులపై పగబట్టిన దామచర్ల
జగనన్న పంపిన సేవకుడిని
మౌలిక వసతులకు పెద్దపీట
అధునాతన వైద్యం
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement