నిర్మల్ అర్బన్ : నిరుద్యోగులు భగ్గుమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ సోమవారం నిర్మల్లో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యావంతులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి చంద్రప్రకాశ్కు వినతిపత్రం అందజేశారు.
నిర్ణయం మానుకోవాలి
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మిమెంట్ చేస్తే అనేక మంది విద్యావేత్తలు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కేసీఆర్ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పులి అశోక్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రవికుమార్, లింగయ్య, అరుణ్, కల్యాణ్, రవి, కాంతరావు తదితరులున్నారు.
క్రమబద్ధీకరణపై విధివిధానాలు లేకే ఆందోళనలు
ఎదులాపురం : కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకపోవడంతోనే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొందని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు జేఎల్ గౌతం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2007 వరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వని కారణంగా విద్యార్థులకు అనుమానాలు తలెత్తుతున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. జిల్లాలో ఎంఈవోలను నియమించాలని, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని, బెల్లంపల్లిలో పెండింగ్లో ఉన్న మెడికల్ కళాశాలను వెంటనే నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని ఉట్నూర్లోనే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.తిరుపతి, పసుల చంటి, ఉపాధ్యక్షులు సంగరి వెంకటేశ్, పాపారావు, కోశాధికారి అర్క శ్రీనివాస్, నాయకులు ప్రశాంత్, చరణ్, రాహుల్ పాల్గొన్నారు.
భగ్గుమన్న నిరుద్యోగులు
Published Tue, Jul 29 2014 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement