రాజ్భవన్ ఎదుట వీహెచ్ మెరుపు ధర్నా
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వవద్దని, వారితో మంత్రివర్గ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయించొద్దని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు శనివారం రాజ్భవన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. రాజ్భవన్లోకి దూసుకుపోవడానికి యత్నించిన వీహెచ్ని పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయొద్దని వీహెచ్ అన్నారు.
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మె ల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించొద్దన్నారు. తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్యాదవ్ను మంత్రిగాప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ తప్పు చేశారన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే గవర్నర్ను బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని కలుస్తామని హెచ్చరించారు.