సవరిస్తే సహించేది లేదు | Sakshi
Sakshi News home page

సవరిస్తే సహించేది లేదు

Published Sat, Jul 25 2015 10:50 PM

vanamal krishna statement on labour rights

వినాయక్‌నగర్: కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడానికి పూనుకుంటే సహించేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల అనుంబంధ బీడీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను చైతన్య పర్చడానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement