► వరలక్ష్మి ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలి
► ఠాణాను ముట్టడించిన బాధిత తల్లిదండ్రులు, బంధువులు
వనపర్తి టౌన్ : ‘కట్నం కోసం పచ్చి బాలింతను చంపేస్తారా.. ఈ కేసులో నిందితులను శిక్షించాల్సిందే..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు, బాధిత బంధువులు ఠాణాను నాలుగు గంటలపాటు ముట్టడించారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. పానగల్ కు చెందిన అలివేల, రాములు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నాడు. వీరి చిన్న కుమార్తె వరలక్ష్మి (22) కి మూడేళ్ల క్రితం వనపర్తి పట్టణంలోని రాయిగడ్డకు చెందిన రాఘవేందర్తో వివాహమైంది. ఆ సమయంలో రూ.5.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. వీరికి రెండేళ్ల కుమారుడితోపాటు పది రోజుల కూతురు ఉన్నారు.
కొంతకాలంగా ఆమెను భర్తతోపాటు అత్త అలివేలు, మామ మన్యంలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గాంధీనాయక్ కేసు దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. కాగా, నిందితులను కఠిన శిక్షించాలంటూ సోమవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వనపర్తి పోలీస్సేష్టన్ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ముట్టడించారు. ‘నేరం చేసిన వాళ్లను భద్రంగా ఠాణాలో పెడతారా..’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, ‘పది రోజుల పచ్చి బాలింత అని చూడకుండా భర్త, అత్త, మామలు చితకబాది చంపేశారు.. మా కడుపు కోత ఎవ రు తీరుస్తారు..’ అని బాధిత తల్లిదండ్రులు రాములు, అలివేల రోదించారు. మా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు.
ఎస్ఐ ఏమన్నారంటే..
వరలక్ష్మి మృతిపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నం, హత్య కింద కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ గాంధీనాయక్ తెలిపారు. బిడ్డను పోగొట్టుకున్న బాధ, ఆవేశంలో ఘర్షణలు జరుగుతాయని భావించి నిందితులకు సెక్యూరిటీ ఇచ్చామన్నారు. చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి వెనుదిరిగారు.
కట్నం కోసం బాలింతను చంపేస్తారా?
Published Tue, May 24 2016 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement