జగ్గారెడ్డికి బ్రాస్‌లెట్‌ అందజేత | Sakshi
Sakshi News home page

జగ్గారెడ్డికి బ్రాస్‌లెట్‌ అందజేత

Published Sat, Jun 3 2017 3:33 AM

జగ్గారెడ్డికి బ్రాస్‌లెట్‌ అందజేత - Sakshi

రాహుల్‌ మాటకు కట్టుబడి అందజేస్తున్నట్లు వీహెచ్‌ వెల్లడి 
 
సంగారెడ్డి టౌన్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్న మాటకు కట్టుబడి టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డికి బ్రాస్‌ లెట్‌ను అందిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత వి.హను మంతరావు తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘ఐతే జగ్గారెడ్డికి ఇచ్చేయ్‌’శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి స్పందించిన ఆయన.. శుక్రవారం ఉదయం సంగారెడ్డికి వచ్చి తన చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌ను జగ్గారెడ్డి చేతికి అలంకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో రాజీవ్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో పడవలో పర్యటిస్తున్న సమయంలో ఆయన వెంట ఉన్న తనను ‘నా కోసం ఏదైనా చేస్తానని తరచూ చెబుతుంటావని.. ఈ నదిలో దూకుతావా’అని సరదాగా ప్రశ్నించగా నదిలో దూకానని తన అనుభవా న్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బంగారు బ్రాస్‌లెట్‌ను జగ్గారెడ్డికి అందజేస్తున్న విషయం త్యాగం కాదని, మంచి సందేశమన్నారు.  కార్యకర్తలు, నాయకుల డిమాండ్‌ మేరకు రాహుల్‌ను మెదక్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరతామన్నారు. 

Advertisement
Advertisement