రూ.2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘన్పూర్ వీఆర్ఓ
స్టేషన్ఘన్పూర్టౌన్ : పట్టా భూమికి ఆన్లైన్ పహణీ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ స్టేషన్ఘన్పూర్ వీఆర్ఓ మడిపల్లి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయూడు. మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ప్రభుత్వాధికారుల్లో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ ఆర్.సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని శివునిపల్లికి చెందిన బజ్జూరి భాస్కర్కు స్టేషన్ఘన్పూర్లో సర్వే నంబర్ 682/ఏ2లో ఎకరం గుంటన్నర, 682/ఏ1లో ఎకరం గుంటన్నర భూమి ఉంది. ఆ భూములకు సంబంధించి అతడికి పాస్పుస్తకాలు ఉన్నారుు. 682/ఏ1 సర్వే నంబర్లోని అతడి భూమికి ఆన్లైన్ పహాణీ రాగా, 682/ఏ2లోని భూమికి ఆన్లైన్ పహాణీ రావడం లేదు.
ఆన్లైన్ పహాణీ కోసం భాస్కర్ ఘన్పూర్ వీఆర్ఓ మడిపల్లి శ్రీనివాస్ను ఫిబ్రవరిలో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు. రెండు, మూడు రోజుల్లో ఇవ్వాల్సిన పహాణీని ఇవ్వకుండా రెండు నెలలుగా తిప్పుకుంటున్నాడు. చివరికి రూ.3వేలు లంచం ఇస్తేనే ఆన్లైన్ పహాణీ చేస్తానన్నాడు. ఈ మేరకు రూ.2 వేలు ఇస్తానని భాస్కర్ చెప్పడంతో మంగళవారం స్థానిక తన ప్రైవేటు ఆఫీస్కు రావాలని వీఆర్ఓ సూచించాడు. ఈ విషయమై ముందస్తుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని వీఆర్ఓ ప్రైవేటు కార్యాలయంలో వీఆర్ఓ శ్రీనివాస్కు రూ.2 వేలు ఇచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే వీఆర్ఓను అదుపులోకి తీసుకుని డబ్బులు రికవరీ చేశారు. అనంతరం వీఆర్ఓను, ఫిర్యాదుదారుడిని స్థానిక తహసీల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. దాడుల్లో డీఎస్పీ సారుుబాబాతోపాటు ఏసీబీ సీఐలు పి.సాంబయ్య, ఎస్వీ రాఘవేంద్రరావు, జి.వెంకటేశ్వర్లు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
లంచావతారులపై ఫిర్యాదు చేయండి..
అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడితే ఏసీబీ అధికారులను ఫిర్యాదు చే యాలని ఏసీబీ డీఎస్పీ ప్రజలకు సూచించారు. 9440446146(ఏసీబీ డీఎస్పీ-సాయిబాబా), 9440446202(సీఐ-సాంబయ్య), 9440446192(సీఐ-రాఘవేంద్రరావు), 9440446148(సీఐ-శ్రీనివాసరాజు), 9440446147(ఖమ్మం ఏసీబీ సీఐ-వెంకటేశ్వరరావు) నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఐదు
నెలలుగా తిరుగుతున్నా : ఫిర్యాదుదారుడు బజ్జూరి భాస్కర్
నా పట్టా భూమికి ఆన్లైన్ పహాణీ కోసం తహసీల్ కార్యాలయం చుట్టూ ఐదు నెలలుగా తిరుగుతున్నా. డిసెంబర్ 2014లో ఈ విషయమై తహసీల్దార్ రామ్మూర్తిని కలిసిన. ఆయన వీఆర్ఓ శ్రీనివాస్ను సంప్రదించాలని సూచిం చారు. వీఆర్ఓ చుట్టూ దాదాపు 30 సార్లు తిరిగిన. మొదట రూ.5 వేలు లంచం అడిగా డు. ఈ నెల 25న చివరికి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తానని చెప్పి అదేరోజున ఏసీబీ అధికారులను కలిసిన.
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Published Wed, Apr 29 2015 1:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement