సీఎం వద్దకు వీఆర్‌ఎస్ వారసుల సమస్య | Sakshi
Sakshi News home page

సీఎం వద్దకు వీఆర్‌ఎస్ వారసుల సమస్య

Published Mon, May 9 2016 3:18 AM

సీఎం వద్దకు వీఆర్‌ఎస్ వారసుల సమస్య - Sakshi

 ఆర్టీసీ చైర్మన్ సోమారపు, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు

గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో 1997 నుంచి 2001 వరకు వాలంటరీ రిటైర్మెంట్ తీసు కున్న కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రభు త్వ విప్ నల్లాల ఓదెలు తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్మిక ఉత్తేజ సభకు హాజరైన వీరికి సింగరేణి వీఆర్‌ఎస్ కార్మికుల వారసుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

సోమారపు మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటి కే పలుసార్లు సీఎంను కలిసి వివరించామని, మరోమారు 11న కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్మికుల హక్కుల సాధన, సంక్షే మం కోసం గుర్తింపు సంఘంతోపాటు టీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తున్నదని చెప్పారు. సం ఘం అధ్యక్షుడు అర్కుటి శంకర్, కోరం నరేందర్‌రెడ్డి, సతీష్‌యాదవ్, కొమురయ్య, మల్లయ్య, ఈశ్వర్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement