ఖమ్మం అర్బన్ : ఖమ్మం శివారు ధంసలాపురం అగ్రహారం కాలనీ పరిధిలోని పాఠశాలలో 1.20 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్హెడ్ ట్యాంకు ఉంది. ధంసలాపురం పంచాయతీగా ఉన్నప్పుడే ఇక్కడ 750 నల్లాలు ఉండేవి. నగరపాలక సంస్థలో ఈ పంచాయతీ విలీనమైనా గత ఏడాది వరకు ఇక్కడి ప్రజలు ఆ ట్యాంకు ద్వారా నీరు అందేది. ట్యాంకుకు నీటి సరఫరా చేసేందుకు ఐదు బోర్లు, ఒక బావిని ప్రభుత్వం ఏర్పాటి చేసింది.
అయితే కొంత కాలంగా రెండు బోర్లు, బావిలో నీరు అడుగంటి పోయాయి. దీంతో ట్యాంకుకు నీటి సరఫరా అంతంత మాత్రంగా అందేవి. దీంతో నీరు సరిపోక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీటి కోసం అలమటించారు. తమ అవస్థలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా వారి సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు రైతు ఆళ్ల వెంటకరెడ్డి. కాలనీకి ఆనుకున్న తన వ్యవసాయ బావి నుంచి నీళ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.
కాలనీలోని సుమారు ఐదు వేల మంది జనాభా కలిగిన సుమారు 1400 కుటుంబాలకు ‘జల’ ఔదార్యం చేసేందుకు పూనుకున్నారు. వెంకటరెడ్డి నిర్ణయాన్ని నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ శ్రీనివాస్ అభినందించారు. ఆయన బావి నుంచి ఓవర్హెడ్ ట్యాంకుకు నీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. బావికి పైప్లైన్లు ఏర్పాటు చేసి ఓవర్హెడ్ ట్యాంకుకు ఎక్కిస్తున్నారు.
భూమి బీడుగా మార్చుకుని...
వెంకటరెడ్డి తనకున్న రెండెకరాల భూమిలో ఈ బావి ఆధారంగానే వ్యవసాయం చేసుకునే వాడు. ఈ ఏడాది గ్రామానికి నీటి సరఫరా చేయాల్సి రావడంతో పంట నష్టపోయినా పర్వాలేదనుకున్నాడు. ప్రజలు మాత్రం నీటి కోసం ఇబ్బందులు పడొద్దనుకుని నాట్లు వేయకుండా భూమిని బీడుగానే వదిలేశాడు. బావిలో పూడిక తీసి నిరాటకంగా నీటిని సరఫరా చేసేందుకు తాను సిద్ధమేనని కార్కొరేషన్ అధికారులతో ఇప్పటికే చెప్పేశాడు.
ప్రజల మనిషి
Published Sat, Nov 22 2014 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement