వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా సీఎం కేసీఆర్ | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా సీఎం కేసీఆర్

Published Sat, May 16 2015 12:32 AM

వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా సీఎం కేసీఆర్ - Sakshi

హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ (టీడీడబ్ల్యుఎస్‌సీ)కు చైర్మన్‌గా సీఎం కేసీఆర్ వ్యవహరించనున్నారు. చైర్మన్‌తోపా టు వైస్ చైర్మన్, డెరైక్టర్లను కూడా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. టీడీడబ్ల్యుఎస్‌సీ వైస్ చైర్మన్‌గా ఐటీ మంత్రి కేటీఆర్‌ను, డెరైక్టర్లుగా పంచాయతీరాజ్, ఆర్థిక, రెవెన్యూ, అటవీ, విద్యుత్, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులను నియమించారు.

వీరితోపాటు హడ్కో రీజినల్ డెరైక్టర్‌ను, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కూడా డెరైక్టర్ల జాబితాలో చేర్చారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్ డెరైక్టర్లను రాజకీయ వర్గాల నుంచి నియమించుకునేందుకు అవకాశం ఉంది. టీడీడబ్ల్యుఎస్ కార్పొరేషన్‌కు రె గ్యులర్ మేనేజింగ్ డెరైక్టర్‌ను ప్రభుత్వం ఇంతవరకు నియమించలేదు. రెగ్యులర్ ఎండీ లేకపోవడంతో టీడీడబ్ల్యుఎస్ కార్పొరేషన్ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

Advertisement
Advertisement