♦ ఏడాదిన్నరగా పైసా విదల్చని సర్కారు
♦ ఫలితంగా 293 ప్రాజెక్టుల్లో అటకెక్కిన 88,159 పనులు
♦ ఇతర ప్రాజెక్టుల్లోకి ఉద్యోగుల డిప్యూటేషన్
♦ ఇప్పటికే 350 మంది ఉపాధిహామీ పథకంలోకి బదిలీ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వం వాటర్షెడ్ పథకానికి స్వస్తి పలికింది. ఈ మేరకు అంతర్గత సంకేతాలిచ్చిన సర్కారు.. ఆ ప్రాజెక్టు కింద సేవలందిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి బదలాయిస్తోంది. ‘ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుదాం.. భూగర్భజలాల వృద్ధితో సాగు విస్తీర్ణాన్ని పెంపొందిద్దాం’ అనే నినాదంతో తలపెట్టిన సమగ్ర వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) భవిష్యత్తు సంకటంలో పడింది. ఏడాదిన్నరగా ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో పనులు అటకెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మూడోవంతు ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిపై ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. తాజాగా మిగిలిన ఉద్యోగులను ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థల ప్రాజెక్టు డెరైక్టర్లకు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
293 ప్రాజెక్టులపై ప్రభావం!
రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్ మినహా ఎనిమిది జిల్లాల్లో సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం కింద 293 ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు మరో 1,491 మైక్రో వాటర్షెడ్లు కొనసాగుతున్నాయి. ఒక్కో వాటర్ షెడ్ పరిధి లో కనిష్టంగా ఐదు గ్రామాలను క్లస్టర్గా పరిగణిస్తూ అక్కడ రాతి కట్టల నిర్మాణం, నీటి వృథాను అరికట్టేందుకు చెక్డ్యాం ల ఏర్పాటు, గులకరాళ్ల కట్టలు, ఇంకుడు గుంతల తవ్వకం, పశువుల కోసం నీటితొట్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి 293 వాటర్షెడ్ల పరిధిలో 1,586 గ్రామాల్లో 88,159 పనులను నిర్దేశించారు.
ఇందుకుగాను రూ.430.06 కోట్లు అవసరమని ప్రణాళిక తయారు చేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటర్షెడ్ కార్యక్రమాలు నిలిచిపోవడంతో అటు సిబ్బందికిసైతం పని లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం ముగియడం.. కొత్తగా 2016-17 వార్షిక సంవత్సరం ప్రారంభం కావడం.. కరువు నేపథ్యంలో ఉపాధిహామీ పనులు ఊపందుకున్న తరుణంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదలాయింపునకు ఉపక్రమించింది. ఇందు లో భాగంగా వాటర్షెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను అవసరమైన చోట ఉపాధి పథకంలోకి మళ్లిస్తోంది.
350 మందికి డిప్యూటేషన్లు!
రాష్ట్రంలో 293 వాటర్షెడ్ ప్రాజెక్టుల్లో 1,955 మంది పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు ఉద్యోగులే. వాటర్షెడ్ పనులకు నిధులివ్వకపోవడంతో వీరిని క్రమంగా ఉపాధిహామీ పథకం కింద పనులకు డిమాండ్ ఉన్నచోటకు డిప్యూటేషన్ పద్ధతిలో పంపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని తాత్కాలిక డిప్యూటేషన్పై పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. డిప్యూటేషన్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లు చర్యలు చే పట్టారు. అదేవిధంగా ఐడబ్ల్యూఎంపీ జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న 88 మంది అధికారులు, ఉద్యోగుల సంఖ్యను కూడా కుదిం చాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మరో పక్షం రోజు ల్లో ఉద్యోగులు, సిబ్బందికి డిప్యూటేషన్లకు సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.
వాటర్షెడ్ డౌన్!
Published Wed, Apr 20 2016 4:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement