రాజయ్యను చేర్చుకునే అంశం చర్చించలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి | Sakshi
Sakshi News home page

రాజయ్యను చేర్చుకునే అంశం చర్చించలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published Tue, Jan 27 2015 4:05 PM

రాజయ్యను చేర్చుకునే అంశం చర్చించలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి  రాజయ్యను బర్తరఫ్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుంభకోణంపై రాజయ్యను వివరణ కోరకుండా పదవి నుంచి తప్పించడమంటే దళితులను అవమానించినట్లేనన్నారు. రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అంశాన్ని పార్టీలో చర్చించలేదన్నారు. ఆ పరిస్థితే వస్తే అప్పుడు ఆలోచిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement