నిజామాబాద్అర్బన్ : జిల్లాలో 462 ఉన్నత పాఠశాలలు, 1573 ప్రాథమిక పాఠశాలలు, 876 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 9,783 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో 2060 మందికి స్థాన చలనం కలిగింది. బదిలీలు, రేషనైజేషన్తో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
జుక్కల్ మండలంలో 55 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఇటీవల జరిగిన బదిలీల్లో 100 మంది టీచర్లు బదిలీ కాగా, 22 మంది మాత్రమే కొత్తగా వచ్చారు. నిజాంసాగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది 11 మంది టీచర్లు అందుబాటులో ఉండగా బదిలీలతో ఇప్పుడు ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇలా జిల్లాలోని 236 పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది.
నగరంలోనూ అంతంతే..
నిజామాబాద్ జండాగల్లి పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు మాత్రమే టీచర్లు ఉన్నారు. సతీష్నగర్లోని ఉర్దూ మీడియం పాఠశాలలో 89 మంది విద్యార్థులకు ఏడాదిరన్నర కాలంగా ఒక టీచర్ మాత్రమే బోధిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో మరో ఇద్దరు వచ్చినా బోధనకు ఇబ్బందిగానే ఉంది. వెంగళరావ్నగర్ కాలనీ పాఠశాలలో 96 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు.
మరికొన్ని పాఠశాలల్లో పరిస్థితి భిన్నం..
జిల్లాలోని మరికొన్ని పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయూ స్కూళ్లలో విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ అశోక్నగర్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. జక్రాన్పల్లి మండలంలో పుప్పల తండాలో 10 మంది లోపు విద్యార్థులుంటే టీచర్లు ఆరుగురు ఉన్నారు. ఇదే మండలంలోని గాంధీనగర్ పాఠశాలలో 10 మంది లోపు విద్యార్థులుంటే 12 మంది టీచర్లు ఉన్నారు. జక్రాన్పల్లి మండలంలోని మరో 9 పాఠశాలల్లో 10 మంది పిల్లలు ఉంటే 16 మంది చొప్పున టీచర్లను నియమించారు. నందిపేట మండలం బజార్కొత్తూరులో 14 మంది పిల్లలకు 16 మంది టీచర్లు ఉన్నారు.
అవకతవకలే కారణం..
విద్యాశాఖలోని అవకతవకల వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అంటున్నారు. బదిలీలు సక్రమంగా చేపట్టకపోవడంతో అవసరమైన చోట తక్కువగా, అవసరం లేని చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాల ని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
పరిశీలిస్తాం...
తక్కువ మంది విద్యార్థులు ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే పరిశీలన చేస్తాం, దీనికి ఆయా పాఠశాలలను గుర్తించి అవసరమైన చోట టీచర్లను అందుబాటులో ఉండేలా చేస్తాం. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఎలా వస్తే అలా కొనసాగిస్తాం, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సక్రమమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటాం.
- లింగయ్య, డీఈఓ
గురువులేరి?
Published Sat, Aug 22 2015 4:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement