వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని...
అశ్వారావుపేట: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అంధుడైన భర్తను హతమార్చిందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి నిర్బంధించిన సంఘటన అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక బంజారా కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆసుపాకకు చెందిన అంధుడు జర్బలా నాగేశ్వరరావు(34)కు దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన అరుణతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అరుణకు ఆసుపాకకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ నాగేశ్వరరావు పలుమార్లు గొడవకు దిగాడు. ఈ విషయంలో గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి తప్పు చేయవద్దంటూ అరుణను హెచ్చరించారు. ఈ క్రమంలో తన భార్య వైఖరి స రిగా లేదంటూ నాగేశ్వరరావు గత ఏడాది అశ్వారావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశా డు. అయినా వైఖరి మార్చుకోకుండా తననే చంపేస్తానని బెదిరిస్తోందని నెల రోజుల క్రితం నాగేశ్వరరావు అశ్వారావుపేటలో పెద్ద మనుషుల వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో తన ఆస్తిని భార్య, పిల్లలకు పంచే విధంగా మూడు రోజుల క్రితం ఒప్పందం చేసుకున్నారు. కానీ సోమవారం రాత్రి అతను ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.
కుక్కలు మొరగడంతో....
సోమవారం రాత్రి 11.30 నిమిషాల సమయంలో నాగేశ్వరరావు ఇంటి వద్ద కుక్కలు మొరుగుతుండడంతో ఇరుగుపొరుగు వారు మేల్కొని వచ్చారు. అప్పటికే నాగే శ్వరరావు ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరి తాడుతో వేలాడుతూ కనిపించాడు. అరుణ, మరో వ్యక్తి కలిసి నాగేశ్వరరావును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపిస్తూ గ్రామస్తులు అరుణపై దాడి చేసి నిర్బంధించారు. అశ్వారావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపాక చేరుకున్న పోలీసులు వెంటనే నాగేశ్వరరావు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నిందితురాలిని పోలీస్స్టేషన్కు తరలించారు.
నాగేశ్వరరావు మృతిపై అనుమానాలు...
నాగేశ్వరరావు మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుట్టు గుడ్డి వాడైన నాగేశ్వరరావుకు చెట్టు ఎక్కడం రాదని, చీకట్లో అతను చెట్టు ఎక్కి ఎలా ఉరి వేసుకున్నాడని అంటున్నారు. నాగేశ్వరరావు మృతితో ఆసుపాకలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు అశ్వారావుపేట కమ్యూనిటీ ఆస్పత్రికి చేరుకున్నారు. అరుణకు అదే గ్రామానికి చెందిన చిలకారావుతో వివాహేతర సంబంధం ఉందని, కోడలు అరుణ, చిలకారావులపై అనుమానాలు ఉన్నాయని నాగేశ్వరరావు తల్లి పిచ్చమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు అశ్వారావుపేట పోలీసులు తెలిపారు.
అంధుడైన భర్తను హతమార్చిన భార్య..?
Published Wed, Jun 18 2014 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement