భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య | Sakshi
Sakshi News home page

భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య

Published Mon, Nov 10 2014 8:04 AM

భర్తను గొంతునులిమి హతమార్చిన భార్య - Sakshi

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని బాలజీనగర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తాళికట్టిన భర్తనే హతమార్చిందో భార్య.  ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.  స్థానికంగా నివాసం ఉంటున్న శ్రవణ్ కుమార్, పావని దంపతుల మధ్య గత కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాంతో భర్త వేధింపులకు విసిగిపోయిన  పావని...  శ్రవణ్ కుమార్ను గొంతునులిమి హతమార్చింది.

కాగా శ్రవణ్ కుమార్ గత కాలంగా మద్యం సేవించి భార్య పావనిని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడని, దాంతో వేసారిన ఆమె ఈ హత్య చేసినట్లు సమాచారం. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితురాలిని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement