♦ భర్తపై భార్య హత్యాయత్నం
♦ కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నం
♦ తీవ్ర గాయాలు..ఆస్పత్రికి తరలింపు
దోమ : తన సరదాలకు అడ్డు తగులుతున్నాడనే కోపంతో భర్తను చితకబాది ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించింది ఓ భార్య. ఈ సంఘటన దోమ మండలంలోని రాకొండలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాకొండకు చెందిన బోయిని వెంకటయ్య, భారతమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి పదేళ్లలోపు వయసున్న కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా భార్య మద్యానికి బానిసైంది. భర్తతోపాటు పిల్లల బాగోగులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తరచూ చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకోవడం, దాడికి పాల్పడుతోంది.
పద్ధతి మార్చుకోవాలని భర్త ఎన్నిసార్లు సూచించినా ఆమె పట్టించుకోలేదు. పై పెచ్చు అతడిపైనే దాడికి దిగేది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భర్త వేరే గ్రామానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుటుంబ విషయమై అతడితో వాగ్వావాదానికి దిగి కర్రతో చితకబాదింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అదే రాత్రి నిద్రిస్తున్న భర్తపై కిరోసిన్పోసి నిప్పంటించి పారిపోయింది. మంటలకు తాళలేక బయటకు పరిగెత్తుకు వెళ్లి గ్రామస్తులకు తెలపడంతో వారు అత డిని వెంటనే చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు అంజిలయ్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ భీంకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జల్సాలకు అడ్డొస్తున్నాడని..
Published Wed, Jul 22 2015 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement