చలి తీవ్రతకు వృద్ధుడు మృతి | Sakshi
Sakshi News home page

చలి తీవ్రతకు వృద్ధుడు మృతి

Published Mon, Dec 28 2015 9:17 AM

winter killed elder man

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న చలి.. జనం ప్రాణాలు తీస్తోంది. తాజాగా.. కరీంనగర్ జిల్లా లో చలితీవ్రతకు ఒక వృద్ధుడు మరణించాడు. బెజ్జంకి మండలం హనుమాజీపల్లికి చెందిన అమ్మిగల్ల లసుమయ్య(75) ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి చనిపోయి ఉన్నాడు. చలి తీవ్రత తట్టుకోలేకనే అతడు మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.


 

Advertisement
Advertisement