Sakshi News home page

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

Published Thu, Feb 11 2016 11:54 AM

Woman commits suicide

నార్నూర్ మండలం ఖాండవ్ గ్రామంలో ఓ మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఖాండవ్ గ్రామానికి చెందిన జాదవ్ రేణుక(40) ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పక్కింటి వారితో గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement