చంపేసి.. గోతిలో పాతిపెట్టారు | Sakshi
Sakshi News home page

చంపేసి.. గోతిలో పాతిపెట్టారు

Published Mon, Jun 15 2015 11:33 PM

woman deadbody found by dogs eating

రంగారెడ్డి: గుర్తుతెలియని దుండగులు ఓ వివాహితను చంపేసి మృతదేహాన్ని గోతిలో పాతిపెట్టారు. కుక్కలు మృతదేహాన్ని పీక్కుతినడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. దుండగులు దాదాపు 20 రోజుల క్రితం వేరే ప్రాంతంలో మహిళను చంపి ఇక్కడకు తీసుకొచ్చి పాతిపెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర పంచాయతీ పరిధిలోని కీసరగుట్ట ప్రాంతంలో సోమవారం పశువులను మేపుతున్న కొందరు ఓ మహిళ అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మహిళకు దాదాపు 30 ఏళ్ల వయసు ఉండొచ్చని. మహిళ కాలుకు మెట్టెలు ఉండటంతో ఆమె వివాహిత అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement