రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Published Wed, Jan 7 2015 4:26 AM

Woman killed in road accident

ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు

గజసింగవరం(గంభీరావుపేట) : మండలంలోని గజసింగవరంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సముద్రలింగాపూర్ పరిధిలోని మక్తనాయక్ తండాకు చెందిన భూక్య భూదవ్వ(50)  మృతి చెందింది. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపు వస్తున్న కారు భూదవ్వను ఢీకొట్టింది. ఈ  ఘటనలో భూదవ్వ అక్కడికక్కడే మృతి చెందింది.

మృతురాలి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ  గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కారు మల్యాల ఏఎస్సై రాజయ్యకు చెందినదిగా గుర్తించారు. గంభీరావుపేట ఏఎస్సై జాఫర్‌షరీఫ్, ఎల్లారెడ్డిపేట ఎస్సై నరేశ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు.  
 
 రోడ్డు ప్రమాదం, మహిళ మృతి, ఆందోళన,
Accident, the death of the woman concerned,
 

Advertisement

తప్పక చదవండి

Advertisement