హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు మహిళలు ధర్నాకు దిగారు. గత పదిహేనేళ్లుగా ఉన్న అమ్ముగూడా భూ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. సైనిక పురి అమ్ముగూడా వద్ద 15 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు.
అనంతరం ఇళ్లు కట్టుకోవడానిక అనుమతి కోసం వెళ్ళితే అధికారులు ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంది అనుమతీ ఇవ్వలేమని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా తమ సమస్యను పరిష్కరించాలని భాదితులు ముత్తిరెడ్డి చుట్లూ తిరుగుతున్నారు. అయినప్పటికీ తమ సమస్యను పరిష్కరించక పోవడంతో భాదితులు గురువారం హబ్బిగూడలోని ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన మహిళలు
Published Thu, Jul 13 2017 12:22 PM
# Tag
Related news
-
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గాజాపై దాడుల ఎఫెక్ట్.. అమెరికాలో బైడెన్కు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడుల ఘటన తాజాగా అమెరికాను తాకింది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అగ్ర రాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్కు వ్యతిరేకంగా అమెరికాలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో, ఉద్రిక్తత నెలకొనడంతో 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు నిరసనలకు దిగారు. రోడ్లకు మీదకు వచ్చి భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనల్లో భాగంగా అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. *BREAKING NEWS* Israel supporters put up pictures of people killed on October 7th outside the pro Palestinian encampment at Columbia University. Meanwhile, over 400 students have been arrested as division continues to grow. pic.twitter.com/YFCU9IU9YN— MorrisNews (@morrisnews12) April 24, 2024 కాగా.. అమెరికాలోని యేల్, ఎంఐటీ, హార్వర్డ్, కొలంబియా తదితర యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇక, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీలో తరగతి గదులను మూసివేశారు. మిగిలిన సెమిస్టర్కు హైబ్రీడ్ పద్దతిని అనుసరించనుంది. ఇక, తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ తెలిపారు. A view from the Mario Savio steps of Sproul Hall, where I’m standing with Faculty and Staff for Justice in Palestine. Happening now at UC Berkeley! #Divest #BDS #FromTheRiverToSeaPalestineWillBeFree #UCDivest #StudentsForJusticeInPalestine #UCBerkeley pic.twitter.com/zmbyUaryrV— Brooke Lober (@brookespeeking) April 22, 2024 ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక, సోమవారం విద్యార్థులతో పాటు. ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా, బోస్టన్, హార్వర్డ్, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. Puluhan Mahasiswa dan Dosen Pengajar New York University ditangkap kepolisian Amerika karena mendukung dan melakukan aksi solidaritas terhadap Gaza dan Palestina. Selasa (23/4)Sumber: QudsN pic.twitter.com/cjN0F93cEl— Lembayung Senja 🐾👣 (@Lembayungsyahdu) April 24, 2024 న్యూయార్క్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, పలువురు విద్యార్థులను అరెస్టుచేసినట్టు తెలుస్తోంది. ఇక, కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు 15 గుడారాలను ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఆందోళనను వైట్ హౌస్ ఖండించింది. Hundreds of faculty members at Columbia University in New York held a mass walkout on Monday in solidarity with students advocating for Palestine. #WeAreAllGaza pic.twitter.com/2L1UBOWaH1— MuslimWomensCouncil (@MWC_Bradford) April 24, 2024 -
లోక్సభలో నారీ పవర్..
(మేకల కళ్యాణ్ చక్రవర్తి) : రాజకీయాల్లో రాణించడం.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయతీరాలకు చేరడం అంత సులువేమీ కాదు. భారత్లాంటి సాంప్రదాయ దేశాల్లో మహిళాలోకం రాజకీయంగా అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టమే. అయినా ఉక్కు మహిళలుగా పేరొందిన మన దేశ నారీమణులు ప్రత్యక్ష ఎన్నికల్లో బ్రహా్మండంగా రాణిస్తున్నారు. సమకాలీన పరిస్థితులు, పురుషాధిపత్య రాజకీయాలను అధిగమిస్తూ అనేకస్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మొదలు దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి మహోన్నత స్థానాల్లో కూడా కూర్చున్న ఘనత మన భారతీయ మహిళలది. మండల పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా, ఆర్థికం లాంటి కీలకశాఖలు నిర్వహించిన ధీర వనితలుగా మన దేశ మహిళలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి భారతీయ మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్ దిగువసభ అయిన లోక్సభలో నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 4–5 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు లోక్సభలో ఏకంగా 14 శాతం దాటింది. క్షేత్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో జరిగే లోక్సభ ఎన్నికల్లో నారీమణులు పురుషులను ఢీ కొడుతూ, రాజకీయ దిగ్గజాలను ప్రజాక్షేత్రంలో మట్టికరిపిస్తూ ప్రజల మన్ననలు పొంది దేశంలోనే అత్యున్నత చట్టసభలో అడుగుపెడుతున్నారు. మాటలే కాదు... చేతల మాస్కరీన్ యానీమాస్కరీన్...వాక్ స్వాతంత్య్రం, విద్యావికాసం, తిరుగుబాటు, మహిళా సాధికారతకు ప్రతీక ఈ పేరు. ప్రస్తుత కేరళ రాష్ట్రం, అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో జన్మించిన ఈమె రాజకీయాల్లో మహిళాప్రాతినిధ్యానికి 20వ శతాబ్దం తొలినాళ్లలోనే బీజం వేసిన యోధురాలు. 1902 జూన్ 6న లాటిన్ కాజిnథలిక్ కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వఉద్యోగి అయిన తండ్రి గాబ్రియెల్ పెంపకంలో తిరువనంతపురంలోని మహారాజాస్ కళాశాల నుంచి డబుల్ పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ) చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. ఆ తర్వాత 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్లో చేరిన మాస్కరీన్ సంస్థానా«దీశులు, దివాన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దివాన్గా పనిచేసిన రామస్వామి అయ్యర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జరిపిన పోరాటంలో ఆమె క్రియాశీలపాత్ర పోషించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె పోలీసు దెబ్బలు తిన్నారు. ఆమె ఇంటిని కూలగొట్టి, ఇంట్లోని వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత 1939లో ఆమె ట్రావెన్కోర్ సంస్థానంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మాస్కరీన్కు 1946, ఫిబ్రవరి 21న మహాత్మాగాంధీ రాసిన లేఖ అప్పట్లో సంచలనమైంది. బాంబేలో ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి స్పందిస్తూ ‘మీ నాలుక అదుపులో లేదు. బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు.’అని రాస్తూనే ట్రావెన్కోర్ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించాలని గాందీజీ ఆ లేఖలో కోరడం గమనార్హం. ఇక, ఆ తర్వాత 1946లో ఏర్పాటైన 299మంది సభ్యులతో కూడిన కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో నియమితులయ్యారు. 1951లో మొదటి లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఆరుగురి అదృష్టం ఏంటో? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎంపీ ఎన్నికలు జరగ్గా 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(టీఆర్ఎస్) నిజామాబాద్ నుంచి, 2019 ఎన్నికల్లో మాలోతు కవిత(టీఆర్ఎస్) మహబూబాబాద్ నుంచి గెలుపొందారు. ఇక, 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మళ్లీ మహబూబాబాద్ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే.అరుణ మహబూబ్నగర్ నుంచి బరిలో నిలిచారు. హాస్పిటల్ రంగానికి చెందిన కొంపెల్లి మాధవీలత (బీజేపీ) హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డిలను రంగంలోకి దింపింది. జాతీయస్థాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు ♦ 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు ♦ 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య... 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు -
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్ -
Lok sabha elections 2024: నాన్లోకల్ నాయిక
దిగ్గజాల వంటి లోకల్ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్ ‘లోకల్’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్’! ‘తగ్గేదే లే...’ అంటున్నారు మహిళా రాజకీయ వలస పక్షులు. వీరిలో చాలామంది ఉత్తరప్రదేశ్ను తమ రాజకీయ కర్మభూమిగా మార్చుకోవడం విశేషం. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి అత్యధిక సంఖ్యలో నాన్ లోకల్ నాయికలకు రాజకీయ భిక్ష పెట్టిన రికార్డు కూడా ఉంది. అలా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ రాజకీయ అరంగేట్రం చేసినవారిలో ఏకంగా రాష్ట్రాన్నే ఏలిన వారొకరు. కేంద్రంలో చక్రం తిప్పినవారు ఇంకొకరు. ఈ వలస పక్షుల్లో సినీ తారలూ ఉన్నారు... డింపుల్ ‘భాభీ’... డింపుల్ యాదవ్ స్వస్థలం ఉత్తరాఖండ్. సమాజ్వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్యగా యూపీలో అడుగుపెట్టారు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ చేతిలో ఓటమి చవిచూశారు. 2012లో కనౌజ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2019లో మళ్లీ ఓడినా 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత మెయిన్పురి ఉప ఎన్నికలో గెలుపొందారు. ‘వికాస్ కీ చాబీ.. డింపుల్ భాభీ..’ అంటూ సమాజ్వాదీ కార్యకర్తల నినాదాల నడుమ రెట్టించిన ఉత్సాహంతో ఈసారీ మళ్లీ మెయిన్పురిలో బీజేపీతో తలపడుతున్నారు. మీరా.. షీలా.. సుచేతా... బిహార్కు చెందిన లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా యూపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో బిజ్నోర్ ఉప ఎన్నికలో విజయంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది. కానీ తర్వాత ఆమె యూపీ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 2017లో యూపీఏ రాష్ట్రపతి అభ్యరి్థగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవిద్ చేతిలో ఓడారు. ఢిల్లీ సీఎంగా సుదీర్ఘకాలం చక్రం తిప్పిన పంజాబ్ పుత్రి షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరఫున 1994లో తొలిసారి యూపీలోని కనౌజ్ నుంచే గెలిచారు. యూపీ తొలి మహిళా సీఎంగా చరిత్రకెక్కిన ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సుచేతా కృపలానీ స్వస్థలం పంజాబ్! రాజకీయాల్లోనూ జయప్రదం రాజమండ్రిలో పుట్టిన తెలుగుతేజం జయప్రద. అసలు పేరు లలితారాణి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలగడమే గాక బాలీవుడ్లోనూ రాణించారు. ఏడెనిమిది భాషల్లో నటించి ఎనలేని స్టార్డం సొంతం చేసుకున్నారు. ఎనీ్టఆర్ ప్రోద్బలంతో 1994లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పారీ్టతో విభేదించి సమాజ్వాదీ పారీ్టలో చేరడం ద్వారా యూపీలో అడుగు పెట్టారు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి విజయం సాధించారు. అనంతరం సమాజ్వాదీతోనూ పొసగక రా్రïÙ్టయ లోక్మంచ్ పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరికి 2019లో బీజేపీ గూటికి చేరారు. మాయావతి.. యూపీ క్వీన్ ఈ ‘బెహన్ జీ’ పుట్టింది, చదివింది ఢిల్లీలో అయినా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది మాత్రం యూపీ నుంచే. 1984లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరిన మాయావతి 1989లో తొలిసారి యూపీ నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె రాజకీయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. రాష్ట్రంలోనే గాక దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని దళిత నేతగా ఎదిగారు. 1995లో కాన్షీరాం ఆశీస్సులతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దేశంలో తొలి దళిత మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు యూపీ సీఎంగా చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాస్వామ్య సంచలనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభివరి్ణంచారు. స్మృతీ ఇరానీ.. జెయింట్ కిల్లర్ ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సీరియల్ ‘క్వీన్’ బుల్లితెర నటిగా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచారు. 2003లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో పోటీ చేసిన ఓడినా వెనకడుగు వేయలేదు. రాజ్యసభకు నామినేటయ్యారు. 2014లో అమేథీలో రాహుల్తో పోటీ పడటం ద్వారా యూపీ గడ్డపై కాలుమోపారు. తొలి ప్రయత్నంలో ఓడినా 2019లో రాహుల్ను ఓడించడంతో జెయింట్ కిల్లర్గా ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. తనను ‘అమేథీ కీ బిటియా (అమేథీ బిడ్డ)’గా అభివరి్ణంచుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఈసారీ అమేథీ బరిలో నిలచి, దమ్ముంటే తనతో తలపడాలంటూ రాహుల్కు సవాలు విసురుతున్నారు. హేమమాలిని... మథుర ‘గోపిక’ అందం, నటనతో దేశాన్ని ఉర్రూతలూపిన బాలీవుడ్ డ్రీమ్గాళ్ హేమమాలిని స్వస్థలం తమిళనాడు. తమిళ సినిమాల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టి బంపర్హిట్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో స్థిరపడిన హేమ 2011లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరి యూపీ బాట పట్టారు. 2014లో మథుర నుంచి 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తన స్థానికతపై విపక్షాల విమర్శలను, ‘‘కృష్టుడిని ఆరాధించే గోపికగా మథురను నా స్వస్థలంగా మార్చుకున్నాను. పదేళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తూ వారి మనసు గెలిచా. మళ్లీ గెలుపు నాదే’ అంటూ దీటుగా తిప్పికొడుతున్నారీ ‘బసంతి’! ధీశాలి... మేనక ఇందిర చిన్న కొడుకు సంజయ్ భార్యగా గాం«దీల కుటుంబంలో అడుగుపెట్టిన మేనక భర్త మరణాంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. 26 ఏళ్ల వయసులో రా్రïÙ్టయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ స్థాపించి 1984లో యూపీలోని అమేథీ నుంచి ఏకంగా రాజీవ్నే ఢీకొట్టి ఓడారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్సభకు వెళ్లారు. 2004లో బీజేపీలో చేరారు. పిలిభిత్ నుంచి ఆరుసార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా రాణించారు. గత ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలిచిన ఈ జంతు ప్రేమికురాలు ఈసారీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఇటలీ టు ఢిల్లీ.. వయా యూపీ యూపీకి రాజకీయంగా వలస వచ్చి దేశంలోనే పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎదిగిన మహిళల్లో అగ్రతాంబూలం సోనియా గాం«దీదే. ఇటలీలో పుట్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెళ్లాడి, భారత్ను మెట్టినింటిగా చేసుకున్న సోనియా రాజకీయ రంగప్రవేశం చేసింది యూపీ నుంచే. గాం«దీల కంచుకోటైన అమేథీ నుంచే 1999 లోక్సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2004లో రాయ్ బరేలీ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో సూపర్స్టార్గా మారారు. యూపీఏ చైర్పర్సన్గా పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2019 దాకా రాయ్బరేలీ నుంచే లోక్సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా సోనియా రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి కూతురు ప్రియాంక బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Related News by category
-
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్రావు, సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.కరీంనగర్లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలుఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు2019లో పెద్దపల్లి లోక్సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..! -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
ఒక్క క్లిక్తో టెన్త్ రిజల్ట్స్ చూస్కోండి
క్లిక్ చేయండి పదో తరగతి ఫలితాలు చెక్ చేస్కోండి -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్గా రిజల్ట్ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement