మహిళ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Published Thu, Jan 29 2015 6:45 PM

woman suspicious death

కరీంనగర్: జిల్లా లోని గోదావరిఖనిలో ఎల్బీనగర్ కోల్ కాలనీకి చెందిన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. కాలనీకి చెందిన దాసరి పద్మ(38) గురువారం మధ్యాహ్నం ఇంట్లో అచేతనంగా పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆమె ఎలా మరణించిందనే విషయం తెలియరాలేదు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
Advertisement