రైలు కిందపడి తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య

Published Sat, Oct 18 2014 8:49 AM

women throw kids before trains, commit suicide in warangal district

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్లో విషాదం చోటుచేసుకుంది.  మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో  పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

 

కుటుంబ కలహాల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఖమ్మంకు చెందిన శ్రావణి (35),  అమూల్య (12), జీవని (6)గా  గుర్తించారు. శ్రావణి తన ఇద్దరు కూతుళ్లతో సహా శుక్రవారం అర్థరాత్రి మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement
Advertisement